- Advertisement -
ఇద్దరు మావోయిస్టులు మృతి
రాయ్ పూర్ : ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మరణించినట్టు పోలీసులు తెలిపారు. ఇంద్రావతి నది తీరం వెంబడి ఉన్న అడవిలో గురువారం ఉదయం భద్రతాదళాల ఉమ్మడి బృందం సోదాలు జరుపుతుండగా కాల్పులు జరిగినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. అప్రమత్తమైన భద్రతాదళాలు కాల్పులు జరిపాయని, ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారని అన్నారు.
- Advertisement -



