Saturday, July 19, 2025
E-PAPER
Homeజాతీయంజార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్‌

జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్‌

- Advertisement -

ఒక జవాన్‌, ఇద్దరు మావోయిస్టులు మృతి
బొకారో జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఘటన

రాంచీ :
దేశంలో మావోయిస్టులపై కేంద్ర బలగాల అణచివేత కొనసాగుతున్నది. మొన్నటి వరకు కాల్పుల మోతలతో ఛత్తీస్‌గఢ్‌ అడవులు దద్దరిల్లాయి. తాజాగా జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ఒక సీఆర్పీఎఫ్‌ జవాన్‌తో పాటు ఇద్దరు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఇది బొకారో జిల్లాలోని అటవుల్లో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయని పోలీసు అధికారులు చెప్పారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోమియా పోలిస్‌స్టేషన్‌ పరిధిలోని బిర్‌హోర్‌డెరా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, సీఆర్పీఎఫ్‌ జవాన్లకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. బుధవారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. సీఆర్పీఎఫ్‌ కోబ్రా బెటాలియన్‌కు చెందిన ఒక జవాన్‌ ప్రాణాలు కోల్పోయారని బొకారో జోన్‌ ఐజీ క్రాంతి కుమార్‌ గడిదేసి తెలిపారు. ఎన్‌కౌంటర్‌ తర్వాత కూడా ఆ ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతున్నదని బొకారో ఎస్పీ హర్విందర్‌ సింగ్‌ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -