Wednesday, March 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జిపిఆర్ఎస్ పై రైతులకు అవగాహన

జిపిఆర్ఎస్ పై రైతులకు అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
జిపిఆర్ఎస్ పై డీలర్స్ కు యూరియా బుకింగ్ చేసుకునే విధానంపై రైతువేదికలో మంగళవారం వ్యవసాయ అధికారిణి మహేశ్వరి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ.. యాప్ ద్వారా యూరియాను ఎలా బుక్ చేసుకోవాలో వివరించారు. ఒకవేళ బుకింగ్ రాని వాళ్ళకి ఫర్టిలైజర్ షాప్ దగ్గరనే సంబంధిత అధికారులు బుక్ చేసి ఇస్తారని తెలిపారు. యూరియా ఒకసారి బుక్ చేసుకుంటే 24 గంటలు తీసుకోవాడానికి అవకాశం ఉంటుందని అన్నారు. లేనిచో స్లాట్ క్యాన్సిల్ అవుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రైతులు, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -