Tuesday, November 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మొంథా తుఫాన్ వలన నష్టపోయిన రైతులను ఆదుకోవాలి..

మొంథా తుఫాన్ వలన నష్టపోయిన రైతులను ఆదుకోవాలి..

- Advertisement -

షరతులు లేకుండా తడిసిన ధాన్యాన్ని, పత్తిని కొనుగోలు చేయాలి..తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్

ఇటీవల కురిసిన మెంతా తుఫాన్ మూలంగా నష్టపోయిన రైతుల యొక్క పంటను అంచనావేసి రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలని చరిత్ర లేకుండా తడిసిన ధాన్యాన్ని పత్తిని కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం తెలంగాణ రైతు సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.ఈ ధర్నా సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొంథా తుఫాన్ మూలంగా జిల్లాలో వరి పంట పూర్తిగా దెబ్బతిని పోయి రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంట చేతికందేలోపే మొంథా తుఫాన్ తుఫాను వచ్చి రైతులను నిండా ముంచిందన్నారు. తుఫాను మూలంగా పత్తి రంగు మారడంతో సీసీఐ కేంద్రాలు కొనుగోలు చేయడంలో తీవ్ర జాతీయాన్ని రంగు మారడంతో సీసీఐ కేంద్రాలు కొనుగోలు చేయడంలో తీవ్ర జాప్యాన్ని ప్రదర్శిస్తున్నాయని అన్నారు. జిల్లా వ్యాప్తంగా వరి పంట నేలకొరిగి నీటిపాలైందని అన్నారు.

వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో గ్రామాల్లో పర్యటించి పంట నష్టాన్ని పంచరావ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో గ్రామాల్లో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వరి పంటకు ఎకరానికి 40 వేల రూపాయలు పత్తికి 70 వేల రూపాయల నష్టపరిహారం అందించాలని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం రైతాంగం పంట నష్టపోతుంటే పట్టించుకోవడంలో నిర్లక్ష్యం చేస్తుందన్నారు ఇప్పటివరకు పంట నష్టపరిహారాన్ని ప్రకటించకపోవడం దుర్మార్గం అన్నారు ఎన్నికల మీద కాంట్రాక్టుల మీద ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ రైతాంగంపై లేదని విమర్శించారు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల మూలంగా రైతాంగం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే పట్టించుకునే నాధుడే కరువయ్యాడని అన్నారు.

ఐకెపి పిఎసిఎస్ కేంద్రాల్లో ధాన్యాన్ని రోజుల తరబడి నిల్వచేసిన కొనుగోలు జాప్యం చేస్తున్నారని అన్నారు ఐకెపి కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దయి మొలకెత్తుతున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందన్నారు ఐకెపి పిఎసిఎస్ కేంద్రాల్లో మొలకెత్తిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని అన్నారు. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని జిల్లా వ్యాప్తంగా అధికారులను కదిలించి పంట రాష్ట్ర పరిహారం వివరాలు తెలుసుకొని పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు ధర్నా అనంతరం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది.

ఈ ధర్నా కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొలిశెట్టి యాదగిరిరావు,పారేపల్లి శేఖర్ రావు,మేదరమెట్ల వెంకటేశ్వరరావు సహాయ కార్యదర్శి దండా వెంకటరెడ్డి, మేదరమెట్ల వెంకటేశ్వరరావు సహాయ కార్యదర్శి దండా వెంకటరెడ్డి,షేక్ సైదా,దుగ్గి బ్రహ్మం, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి రైతు సంఘం జిల్లా నాయకులు దేవరం వెంకటరెడ్డి, నాగిరెడ్డి శేఖర్ రెడ్డి, గోపాల్ రెడ్డి,నారాయణ వీరారెడ్డి, అవిరే అప్పయ్య,మేరెడ్డి కృష్ణారెడ్డి పందిరి సత్యనారాయణ రెడ్డి, మేకనబోయిన శేఖర్, ఉపేందర్,సైదులు ఎస్కే కాజాబి, మారం చంద్రారెడ్డి దండ శ్రీనివాస్ రెడ్డి పరమేష్ రావులపెంట ఎంకన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -