- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఝార్ఖండ్లోని గిరిదిహ్ జిల్లా, ఇసారి బజార్ మార్కెట్ ఏరియాలో శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఒక ట్రక్కు అదుపుతప్పి వాహనాలు, పాదచారులపైకి దూసుకెళ్లడంతో నలుగురు మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు, వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టి, ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



