- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండల కేంద్రం నుండి కుర్ల గ్రామం వైపు వెళ్లే రహదారి పైన భారీ గుంతలను అధికారులు పూడ్చివేశారు. మద్నూర్ ఎస్సై, విజయ్ కొండ డోంగ్లి తహసిల్దార్ ప్రవీణ్ కుమార్, ఆర్ఐ సాయిబాబా తదితర అధికారులు ఈ ప్రత్యేక చర్యలకు పూనుకున్నారు. దీంతో పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ అధికారులను ప్రజలు, వాహనదారులు ప్రశంసించారు.
- Advertisement -