నవతెలంగాణ – కంఠేశ్వర్ : ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ ఆధ్వర్యంలో సోమవారం 11 వ తెలాంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐఎంంఏ అధ్యక్షులు డా. అజ్జ శ్రీనివాస్ ఐఎంఏ బిల్డింగ్ ప్రాంగణంలో జాతీయ జెండా ను ఎగరవేశారు. సభ్యులందరు గౌరవ వందనం చేస్తూ జాతీయ గీతం ఆలపించారు. ఈ సందర్బంగా అధ్యక్షులు డా. అజ్జ శ్రీనివాస్ కార్యదర్శి డా. విక్రం రెడ్డి నిజామాబాదు జిల్లా ప్రజలందరికీ తెలాంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసీ, నేడు తెలంగాణ రాష్ట్రం ఎంతో మంది అమరవీరుల త్యాగఫలంతో, ఉద్యమకారుల పోరాటంతో ఆవిర్భవించినదని, తెలంగాణ ప్రజలు సొంత రాష్ట్రం సాధించుకున్న రోజు అని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు డా. అజ్జ శ్రీనివాస్ కార్యదర్శి డా. విక్రం రెడ్డి, మాజీ అధ్యక్షులు డా. దామోదర్ రావ్, డా. కొట్టూరు శ్రీశైలం, ఉపాధ్యక్షులు డా. హరీష్ స్వామీ, కొశాదికారి డా. రాజేందర్ సూరినీడు, డా. సీనియర్ వైద్యులు డా. డిఎల్ఎన్ స్వామీ, డా. సురేందర్ రెడ్డి, డా. వినోద్ కుమార్, డా. రవీంద్రానాథ్ సూరి, డా. జీవన్ రావు, డా. శ్యాం సుందర్, డా. మురళి కృష్ణా తదితరులు పాల్గొన్నారు.
ఐఎంఏ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES