Monday, June 2, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంపాలస్తీనాకు మద్దతుగా మాట్లాడినందుకు

పాలస్తీనాకు మద్దతుగా మాట్లాడినందుకు

- Advertisement -

– గ్రాడ్యుయేషన్‌ వేడుక నుంచి
– భారత సంతతి విద్యార్థిని బహిష్కరణ
– అమెరికాలో ఒక యూనివర్సిటీ వికృత చర్య
మసాచుసెట్స్‌ (అమెరికా):
పాలస్తీనాకు మద్దతుగా మాట్లాడినందుకు ఒక భారత సంతతి విద్యార్థినిని గ్రాడ్యుయేషన్‌ వేడుక నుంచి బహిష్కరించిన ఘటన అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ)లో చోటు చేసుకుంది. ఇండో అమెరికన్‌ అమ్మాయి అయిన మేఘా వేమూరి ఎంఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌, న్యూరో సైన్స్‌, లింగ్విస్టిక్స్‌లో తాజాగా డిగ్రీ పూర్తి చేసింది. ఆమె ఎంఐటీ క్లాసు ప్రెసిడెంట్‌ కూడా. ప్రస్తుతం ఇజ్రాయిల్‌ చేస్తున్న దాడిలో పాలస్తీనా ఒకరకంగా నాశనం అయిపోయింది. అక్కడి ప్రజలు బాంబు దాడులతో, ఆకలి కొరతతో చనిపోతూ ఉన్నారు. ఎంఐటీ గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమంలో ఈ విషయం గురించి మేఘా మాట్లాడుతూ.. ‘ ఇజ్రాయిల్‌తో ఎంఐటీ సంబంధాలు కలిగి ఉంది. అంటే దానర్థం.. పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్‌ చేస్తున్న దాడులకు మన దేశంతో పాటు మన స్కూలు కూడా మద్దతు తెలుపుతున్నట్టే.. సాయం చేస్తున్నట్టే.. పాలస్తీనాను ఈ భూమ్మీదనుంచి లేకుండా చేయడానికి ఇజ్రాయిల్‌ చూస్తోంది. దాన్ని మనం చూస్తూ ఊరికే ఉన్నాం. ఆ దారుణంలో ఎంఐటీ భాగం అవ్వటం సిగ్గుచేటు’ అని వ్యాఖ్యానించింది. అలాగే ‘ఇజ్రాయిల్‌ మిలటరీతో సంబంధాలు తెంచుకోవాలని డిమాండ్‌ చేస్తూ.. గత సంవత్సరం ఎంఐటీ గ్రాడ్యుయేట్స్‌ బాడీ, అండర్‌ గ్రాడ్యుయేట్‌ యూనియన్‌ ఓట్లు వేసింది. గాజాలో శాశ్వత కాల్పుల విరమణ కోసం మీరు (కాలేజీ సిబ్బంది) పిలుపునిచ్చారు. పాలస్తీనా కోసం పోరాడుతున్న వారికి మద్దతుగా నిలిచారు’ అని తెలిపింది. దీంతో మేఘాను, ఆమె కుటుంబాన్ని వెంటనే కార్యక్రమం నుంచి ఇంటికి పంపేశారు. ఈ చర్యపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -