- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని దోసపల్లి గ్రామం ఈబత్ వార్ పండరి కుమారుని నామకరణ మహోత్సవ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన బాలుడిని నిండు నూరేండ్లు ఆరోగ్యంగా జీవించాలని ఆశీర్వదించారు. అనంతరం ఈబమాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ను శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమం లో మండల పార్టీ అధ్యక్షులు బొల్లి గంగాధర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రమేష్, మాజీ జడ్పీటీసీ పండరి, మాజీ సర్పంచ్ లు శివాజీ పటేల్, రవి పటేల్, కపిల్ పటేల్, యువనాయకులు గజానంద్, ఆనంద్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



