- Advertisement -
నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్
కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతూ ఈనెల 14న తలపెట్టిన రాష్ట్ర బంద్ కు బిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు గుర్క జైపాల్ యాదవ్ ప్రకటించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి లో తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్త శుద్ధితో రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టలేదన్నారు. ఏ ఈ కార్యక్రమంలో వెల్దండ మాజీ ఉప సర్పంచ్ నిరంజన్, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ నాగులు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -