- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : 52వ సబ్ జూనియర్ అక్వాటిక్ నేషనల్ చాంపియన్షిప్స్లో సుహాస్ ప్రీతమ్ మైలారి సత్తా చాటాడు. భువనేశ్వర్లో బుధవారం జరిగిన 100 మీటర్ల బ్యాక్స్ట్రోక్ విభాగంలో సుహాస్ బంగారు పతకం సాధించాడు. 400మీటర్ల వ్యక్తిగత మెడ్లీలో శ్రీ నిత్య సాగి సిల్వర్ మెడల్ నెగ్గగా, 50మీటర్ల ఫ్రీస్టయిల్లో అన్నికా డెబోరా కాంస్య పతకం సాధించింది. వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శన కనబరిచిన సుహాస్ను క్రీడా ప్రాధికార సంస్థ, తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ అభినందించింది.
- Advertisement -



