Wednesday, June 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా రైతు భరోసా సంబురాలు..

ఘనంగా రైతు భరోసా సంబురాలు..

- Advertisement -

-సీఎం, మంత్రి, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం
నవతెలంగాణ – బెజ్జంకి
: ఏడెకరాల విస్తీర్ణం వరకు రైతు భరోసా నిధులను రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసిన సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో మంగళవారం రైతు భరోసా సంబురాలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చిత్రపటాలకు కాంగ్రెస్ శ్రేణులు పాలాభిషేకం చేశారు. ఏఎంసీ చైర్మన్ పులి క్రిష్ణ, మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు లింగాల శ్రీనివాస్, శానగొండ శరత్, కొరికొప్పుల సంపత్, మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య, మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -