- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్
గచ్చిబౌలిలోని ఎన్ఏఎస్ఆర్ బాయ్స్ స్కూల్లో బుధవారం 27వ ఇన్వెస్టిట్యూర్ సెర్మానీ, స్పోర్ట్స్ ఓపెనింగ్ సెర్మానీ ఘనంగా జరిగింది. సైబరాబాద్ సీపీ రమేశ్ ముఖ్య అతిథిగా హాజరై ఈ ఏడాది స్టూడెంట్ కౌన్సిల్కు బ్యాడ్జెట్స్ ప్రదానం చేశారు. స్పోర్ట్స్ ఓపెనింగ్ సెర్మానీలో స్టూడెంట్స్ ప్రదర్శన విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇటీవల జరిగిన క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బహమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎన్ఏఎస్ఆర్ ఎడ్యుకేషన్ సోసైటీ చైర్మన్ ఖుతుబుద్దీన్, బోర్డు డైరెక్టర్లు బేగమ్ సల్వా ఖాన్, ప్రిన్సిపాల్ జమాలుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -


