ఫారెస్ట్ భూమిని లే అవుట్ చేసి విక్రయం
నాలుగు ప్లాట్ లను రూ.3.30 లక్షలకు అమ్మకం
14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు
కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్ : ఫారెస్ట్ భూమిని తనదంటూ లేఔట్ ప్లాట్లు చేసి విక్రయించిన నిందితుడిని, ఫోర్జరీ చీటింగ్ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరు పరచగా క్కర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్లు వెల్లడించారు. ఈ కేసులో భర్త అరెస్ట్ కాగా భార్య వకులభరణం రజని పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. శనివారం మావల పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. 2010 సంవత్సరంలో ఖానాపూర్ శివారులో గల ఫారెస్ట్ భూమిని తన పేరుతో ఉందంటూ నమ్మించి ప్లాట్లు చేసి విక్రయించగా అందులో నాలుగు ప్లాట్లు నంబర్స్ 57 58 59 60 లను మూడు లక్షల 30 వేలకు బాధితురాలు కొనుగోలు చేస్తుంది. 2022లో ఫారెస్ట్ అధికారులు ఆస్థలన్నీ తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అప్పుడు అది ఫారెస్ట్ భూమి అని బాధితులకు తెలుస్తుంది. ఈ సందర్భంలో బాధితులు తమ డబ్బులను తిరిగి ఇవ్వాలని, ఫారెస్ట్ భూమిని తమకు డబ్బులకు అమ్మారని నిందితులను అడగగా వారు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ కోర్టులో చూసుకోవాలని, మీకు నచ్చిన వారికి చెప్పుకోమని బెదిరించడంతో బాధితులకు ఫోర్జరీ మోసం చేయడం జరిగిందని తెలిపారు. ఈ విషయంపై మావల పోలీస్ స్టేషన్ లో బాధితురాలు శోభ ఫిర్యాదు చేయగా సెక్షన్లు 420,467,468,471,290, 506 r/w 34 ఐపిసి కింద కేసు నమోదు చేశారు. విచారణ జరగగా ప్రధాన నిందితుడు వకుళాభరణం ఆదినాథ్ ను అరెస్టుచేశారు. భార్య రజిని పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ విషయంపై రెవెన్యూ అధికారులను ఫారెస్ట్ అధికారులను విచారణ చేయగా అది ఫారెస్ట్ భూమి అని తేలిందని తెలిపారు. భూ అక్రమార్కులపై ఉక్కు పాదం మోపి దిశగా జిల్లా పోలీస్ యంత్రాంగం కఠిన చర్యలను తీసుకుంటుందని, ప్రజలను మోసం చేస్తూ, పత్రాలను సృష్టిస్తూ ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని డిఎస్పీ హెచ్చరించారు. సమావేశంలో సీఐ స్వామి, ముజాహిద్, రవీందర్ ఉన్నారు.
భూ మోసం కేసులో భర్త అరెస్ట్ .. పరారీలో భార్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES