- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం రంగాపురంలో దారుణం చోటుచేసుకుంది. భార్యను గొంతు నులిమి హత్య చేసిన భర్త, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర కలకలం రేగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుల వివరాలు, హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



