నవతెలంగాణ – మద్నూర్ : మద్నూర్ మండల కేంద్రానికి చెందిన హౌసింగ్ బోర్డ్ కాలనీలోని నాగం వార్ హరితేజ్ జేఈఈ అడ్వాన్స్ ఎంట్రెన్స్ పరీక్షలు మంచి ర్యాంక్ సాధించాడు. ఆ అబ్బాయికి మద్నూర్ పాత తాలూకా పరిధిలోని రిటైర్ట్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనంలో శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఉదగుల సంఘం అధ్యక్షులు కె.రామారావు మాట్లాడుతూ.. హౌసింగ్ బోర్డు టీచర్స్ కాలనీకి చెందిన నాగం వార్ హరితేజ్ జేఈఈ అడ్వాన్స్ ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించడం మద్నూర్ హౌసింగ్ బోర్డ్ టీచర్స్ కాలనీకి మంచి పేరు తీసుకువచ్చారని పేర్కొన్నారు. ఇలాంటి ఉన్నత చదువులను ఆ అబ్బాయి మరింతగా అధిరోహించాలని, రితార్డు ఉద్యోగుల సంఘం తరఫున అధ్యక్షులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్. గంగారాం, జి. సెక్రటరీ, డి.మరోతి జిల్లా వి. పి పటేల్ మనోహర్ కార్యదర్శి, నల్లవార్ విఠల్, వై యాదవ్, ఇతర పెన్షనర్లు పాల్గొన్నారు.
జేఈఈ ర్యాంకర్ హరితేజ్ కు ఘన సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES