Saturday, May 16, 2026
E-PAPER
Homeజాతీయంనీట్ పేపర్ లీకేజ్ కేసులో కీలక పరిణామం..

నీట్ పేపర్ లీకేజ్ కేసులో కీలక పరిణామం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ 2026 పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న పుణెకు చెందిన కెమిస్ట్రీ లెక్చరర్ పి.వి. కులకర్ణిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం కులకర్ణిని అదుపులోకి తీసుకున్నట్లు సీబీఐ అధికార ప్రతినిధి ధృవీకరించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)కి డొమైన్ నిపుణుడిగా పనిచేసిన కులకర్ణి, తన హోదాను దుర్వినియోగం చేశారని సీబీఐ వర్గాలు తెలిపాయి.

పుణెలోని తన నివాసంలో ప్రత్యేక కోచింగ్ క్లాసులు నిర్వహించి, విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో డబ్బు తీసుకుని కెమిస్ట్రీ ప్రశ్నపత్రాన్ని వారికి ముందుగానే చెప్పేశారని ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థులను సమీకరించడంలో కులకర్ణికి సహకరించిన మనీషా అనే మహిళను సీబీఐ ఇప్పటికే అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య 8కి చేరింది. పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో మే 3న జరిగిన నీట్-యూజీ పరీక్షను మే 12న ఎన్టీఏ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో భాగంగా సీబీఐ దేశవ్యాప్తంగా పలుచోట్ల సోదాలు నిర్వహించి, కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -