- Advertisement -
- – సీఐటీయు రాష్ట్ర కార్యదర్శి భూపాల్ డిమాండ్
- నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
- కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ భూపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం, యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు ప్రీమియర్ ఎక్స్ ప్లొసివ్స్ ఎంప్లాయీస్ యూనియన్ (సి ఐ టి యు) జనరల్ బాడీ సమావేశం యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్లూరి మల్లేశం అధ్యక్షతన తాళ్ళగూడెం ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా భూపాల్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనం కోసం కార్మికుల పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చారని విమర్శించారు.
 మోదీ అధికారంలోకి వచ్చిన నుండి కార్పొరేట్ లకు 16 లక్షల 35 వేల కోట్లు మాఫీ చేశారని విమర్శించారు. కనీస వేతనం, సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె హక్కు కాలరాయబడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. లేబర్ కోడ్ ల తో 8గంటల పనిని 12గంటలకు పెంచి కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారని విమర్శించారు. కులం, మతం, అస్తిత్వ భావజాలంతో కార్మికొద్యమం దెబ్బ తీయడానికి, రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి బిజెపి ప్రయత్నిస్తుందని విమర్శించారు. కార్మిక హక్కుల కోసం ఐక్య పోరాటలకు సిద్ధం కావాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సి ఐ టి యు జిల్లా సహాయ కార్యదర్శి సుబ్బూరు సత్యనారాయణ, యూనియన్ జనరల్ సెక్రెటరీ సిహెచ్ రమేష్, జిల్లా కమిటి సభ్యులు గంధమల్ల మాతయ్య, పుప్పాల గణేష్ నాయకులు నగేష్, బి వెంకటయ్య, శ్రీనివాస్ రెడ్డి, జె వెంకటేష్, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -

 
                                    