- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలే షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. జాబ్ ఇప్పిస్తానని రూ.2వేలు తీసుకున్న ప్రభు కుమార్ అనే వ్యక్తి, డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయడంతో వారాహి కన్సల్టెన్సీ మేనేజర్ శశికిరణ్రెడ్డిపై కత్తులతో దాడి జరిగింది. సంస్థ అతనికి రూ.1500 ఆన్లైన్ చేయగా, మిగిలిన రూ.500 తర్వాత ఇస్తామని చెప్పింది. అయితే, నిందితుడు వెంటనే మిగిలిన మొత్తాన్ని డిమాండ్ చేయడంతో గొడవ చెలరేగి ఈ దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు.
- Advertisement -



