Sunday, August 23, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఉండవల్లి కొండపై భారీ అగ్నిప్రమాదం

ఉండవల్లి కొండపై భారీ అగ్నిప్రమాదం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి కొండపై ఆదివారం సాయంత్రం 6 గంటల తర్వాత భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈదురుగాలుల వల్ల మంటలు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న నగరపాలక కమిషనర్, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. కొండను ఆనుకుని ఉన్న ఉండవల్లి, పెనుమాక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాదంపై గుంటూరు కలెక్టర్, అగ్నిమాపక శాఖ అధికారులతో సమీక్షించి, మంటలు పూర్తిగా ఆరిపోయేంతవరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -