Monday, May 25, 2026
E-PAPER
Homeఆటలుఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ ప్రస్థానాన్ని విజయంతో ముగించింది. ఆదివారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కేఎల్ రాహుల్ (60) మెరుపు అర్ధశతకానికి తోడు, బౌలింగ్‌లో లుంగి ఎంగిడి, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లతో చెలరేగడంతో ఢిల్లీకి ఓదార్పు విజయం లభించింది. ఈ విజయంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరు సాధించింది. కేఎల్ రాహుల్ కేవలం 30 బంతుల్లోనే 60 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశాడు. చివర్లో డేవిడ్ మిల్లర్ (28), అక్షర్ పటేల్ (39) కూడా రాణించడంతో ఢిల్లీ ఈ వేదికపై తమ అత్యధిక స్కోరును నమోదు చేసింది.

అనంతరం 204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకు కెప్టెన్ అజింక్యా రహానే (39 బంతుల్లో 63) అద్భుతమైన ఆరంభాన్నిచ్చాడు. దీంతో కేకేఆర్ సులభంగా గెలుస్తుందనిపించింది. కానీ, కీలక సమయంలో కుల్దీప్ యాదవ్ ఒకే ఓవర్లో వరుస బంతుల్లో రహానే, రింకూ సింగ్‌ను ఔట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఆ తర్వాత కేకేఆర్ పతనం మొదలైంది. 128/3తో పటిష్టంగా ఉన్న కోల్‌కతా, కేవలం 35 పరుగుల వ్యవధిలో చివరి 7 వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌట్ అయింది. ఢిల్లీ బౌలర్లలో ఎంగిడి, కుల్దీప్ యాదవ్ చెరో 3 వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -