- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మధ్యాహ్న భోజన కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం బుధవారం సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు హైదరాబాద్ విద్యాశాఖ కమిషనర్ కు తరలి వెళ్లారు. హైదరాబాదులోని విద్యాశాఖ కార్యాలయం ఎదుట ధర్నా ఆందోళన చేపట్టేందుకు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. మద్నూర్ ఉమ్మడి మండలంలోని మద్నూర్. డోంగ్లి. మండలాల మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, సిఐటియు జిల్లా నాయకులు సురేష్ గొండ, వీరికి మద్దతు తెలుపుతూ మధ్యాహ్న భోజన కార్మికుల న్యాయమైన డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేసి న్యాయం చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
- Advertisement -