నవతెలంగాణ – హైదరాబాద్ : సహజమైన వస్త్రాలు, మరింత పర్యావరణ అనుకూల ఫ్యాషన్ ఎంపికల దిశగా వినియోగదారులు ఎక్కువగా మొగ్గు చూపుతున్న తరుణంలో, మిస్సమ్మ తమ సమ్మర్ కాటన్ కలెక్షన్ను విడుదల చేసింది. ఇది వారసత్వం, పనితనం, సాంస్కృతిక కథనాలకు కట్టుబడి ఉంటూనే, భారతీయ వేసవి కోసం ప్రత్యేకంగా రూపొందించిన చేనేత చీరల సమాహారం.
ఈ కలెక్షన్లో మంగళగిరి కాటన్, అజ్రఖ్ కాటన్ , కాటన్ కోటా వంటి కాటన్ చీరలతో పాటు రోజువారీ వాడకం, ఆఫీస్ స్టైలింగ్, సాంస్కృతిక సమావేశాలు , నిరాడంబరమైన పండుగ సందర్భాలకు సరిపోయే తేలికపాటి చేనేత కాటన్ చీరల విస్తృత శ్రేణి కూడా ఉంది. ఈ కలెక్షన్ గురించి మిస్సమ్మ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ దిలీప్ కుమార్ గోలి మాట్లాడుతూ, “మిసమ్మ వద్ద, చేనేత వస్త్రాలు కేవలం దుస్తులకు సంబంధించినవి మాత్రమే కాదు; అవి కథలను భద్రపరచడం, ప్రాంతీయ గుర్తింపును చాటిచెప్పడం, ఈ సంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్లే కళాకారులు , నేత కార్మికుల జీవనోపాధిని నిలబెట్టడం వంటి వాటికి సంబంధించినవి.
మా సమ్మర్ కాటన్ కలెక్షన్తో పనితనం, సాంస్కృతిక వైభవాన్ని గౌరవిస్తూనే ఈ సీజన్కు మరియు ఆధునిక జీవనశైలికి అనుగుణంగా ఉండే చీరలను అందించాలని మేము కోరుకున్నాము” అని అన్నారు. సుదీర్ఘ వేసవి రోజులు మరియు వైవిధ్యమైన స్టైలింగ్ అవసరాల కోసం రూపొందించబడిన ఈ చీరలు, సమకాలీన మహిళ కోసం సాంప్రదాయ చేనేత ఎంపికలను మరింత అర్థవంతంగా అందుబాటులోకి తీసుకురావాలనే మిస్సమ్మ యొక్క ప్రయత్నానికి ప్రతిరూపంగా నిలుస్తాయి.
2021లో దిలీప్ గోలి మరియు శేష అలేఖ్యచే స్థాపించబడిన మిస్సమ్మ, ఆలోచనాత్మకంగా ఎంపిక చేసిన చీరల ద్వారా భారతదేశపు గొప్ప చేనేత వస్త్ర వారసత్వాన్ని పునరుజ్జీవింపజేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. వినియోగదారుల నమ్మకాన్ని, అలాగే వారసత్వ ప్రాధాన్యత గల ఫ్యాషన్ బ్రాండ్లకు పెరుగుతున్న డిమాండ్ను మిస్సమ్మ ప్రతిబింబిస్తుంది.


