మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్
నవతెలంగాణ – మద్నూర్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటినుండి నేటి వరకు రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. పోయాయి. జుక్కల్ నియోజకవర్గం నుండి గెలుపొందిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి దక్కలేదు. జుక్కల్ నియోజకవర్గాన్ని 1978లో ఎస్సీ రిజర్వుడు కాన్స్టెన్సీగా ఏర్పాటు చేసినప్పటి నుండి నేటి వరకు ఏ ఒక్క దళిత ఎమ్మెల్యేకు మంత్రివర్గంలో స్థానం లభించలేదు. జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే తోటా లక్ష్మి కాంతారావుకు మంత్రి పదవి ఇవ్వాలని గురువారం మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్ అన్నారు. ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే తోట వెనుకబడ్డ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు చేయించడం, కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు ప్రత్యేక కృషి చేయడం, జగమొండి లేండి ప్రాజెక్టు పెండింగ్ పనులు ప్రారంభం కోసం ప్రత్యేకంగా కృషి చేయడం జరిగిందన్నారు. వెనుకబడ్డ ప్రాంతంలో విద్యా, వైద్య అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేశారన్నారు. ఈ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, గ్రామ గ్రామాన సీసీ రోడ్ల నిర్మాణం, మురికి కాలువల నిర్మాణం, ఇలాంటి అభివృద్ధికి ప్రత్యేకంగా పాటుపడుతున్న తోట లక్ష్మి కాంతారావుకు మంత్రివర్గంలో మంత్రి పదవి దక్కాలని ఈ సందర్బంగా డిమాండ్ చేశారు. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో దళితులకు న్యాయం జరగాలంటే నిరంతరంగా అభివృద్ధి కోసం పాటుపడే ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు కు మంత్రి పదవి ఇవ్వడంలో న్యాయం ఉందని, తమ కోరిక న్యాయమైనదని సీఎం రేవంత్ రెడ్డికి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ కు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్యే తోటకు మంత్రి పదవి ఇవ్వాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES