నవతెలంగాణ – సత్తుపల్లి
జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలో 2026, జులై నెలలో నిర్వహించిన బీఫార్మసీ ఫలితాలలో సత్తుపల్లి మదర్ థెరెసా ఫార్మసీ కళాశాల నాలుగో సంవత్సరం విద్యార్థులు రెండవ సెమిస్టర్ ఫలితాలలో 80% ఉత్తీర్ణత సాధించినట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎర్ర రాజేశ్వర్ తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన వారిలో వాడి శ్రీలత 82% (487) రాజబోయిన లక్ష్మి 817 (485), బెల్లకొండ విష్ణువర్ధన్ 80% (480) ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించినట్లు తెలిపారు. విద్యార్థులను కళాశాల చైర్మన్ కంచర్ల సత్యనారాయణ, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ చలసాని సాంబశివరావు, డైరెక్టర్ డాక్టర్ కందిమళ్ల కృష్ణారావు, మిస్ట్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చలసాని హరికృష్ణ, ఐక్యూఏసీ కో-ఆర్డినేటర్ డాక్టర్ దాసరి ప్రవీణ్ కుమార్, కళాశాల సిబ్బంది విద్యార్థులను అభినందించారు.
బీఫార్మసీ పరీక్షా ఫలితాలలో మదర్ థెరెసా విద్యార్థుల ప్రతిభ
- Advertisement -
- Advertisement -



