‘సినిమా బండి’ ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల ‘పరదా’ అనే మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్తో వస్తున్నారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ మేకర్స్ రాజ్, డికె మద్దతు ఇస్తున్నారు. ఆనంద మీడియా బ్యానర్పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజరు డొంకడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా, దర్శన రాజేంద్రన్, సంగీత, రాగ్ మయూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్ ‘యత్ర నార్యస్తు’ అనే పాటను కూడా లాంచ్ చేశారు. ఈ సినిమా ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్, సాంగ్ లాంచ్ ఈవెంట్కి హీరో సత్యదేవ్, నిర్మాత సురేష్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ,’ఇది చిన్న సినిమా అంటున్నారు.కానీ ఈ సినిమా ద్వారా మేము చెప్పదల్చుకున్న కంటెంట్ మాత్రం చాలా పెద్దది. ఇది చాలా బోల్డ్ స్టెప్. ఒక స్టిరియోటైప్ బ్రేక్ చేయడం మా అందరి అల్టిమేట్ గోల్’ అని అన్నారు. ”యత్ర నార్యస్తు’ పాటకు వనమాలి, గోపి సుందర్ అనురాగ్ అద్భుతమైన అవుట్ పుట్ ఇచ్చారు. అనుపమ ఒప్పుకోకపోతే ఈ సినిమా ఉండేది కాదు. డైరెక్టర్ ప్రవీణ్ అద్భుతంగా సినిమా తీశారు’ అని నిర్మాతలు తెలిపారు. డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల మాట్లాడుతూ, ”సినిమా బండి, శుభం’ తర్వాత ఈ సినిమా నాకు చాలా పెద్ద ఫిల్మ్. ఓ మంచి యూనిక్ కంటెంట్తో ఈ సినిమాని తీశాం’ అని అన్నారు.
యూనిక్ కంటెంట్తో ‘పరదా’
- Advertisement -
- Advertisement -