- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ప్రధాని మోడీ ఐదు దేశాల పర్యటన నేటితో ముగియనుంది. గురువారం ఇండియాకు చేరుకొనున్నారు. మే 15న మొదలైన మోడీ విదేశీ టూర్ వారం రోజులపాటు దిగ్విజయంగా సాగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే ఇటలీ దేశాల్లో పర్యటించారు. ఈ విదేశీ పర్యటనలో భాగంగా ఆయా దేశాల అధినేతలతో పలు కీలక అంశాలపై చర్చలు సాగించారు. శక్తి, రక్షణ, కీలక ఖనిజాలు సరఫరాలపై పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
- Advertisement -



