- Advertisement -
గుట్కా ఉమ్మివేతపై రంగు పడింది
నవతెలంగాణ – మల్హర్ రావు
అపరిశుభ్రంగా తాడిచెర్ల ఎంపీడీఓ కార్యాలయం.. అనే కథనం మంగళవారం నవతెలంగాణ దినపత్రిక వరంగల్ జిల్లా ఎడిషన్ లో ప్రచురించిన సగతి తెలిసిందే. ఈ కథనానికి మండల ప్రజాపరిషత్ కార్యాలయం అధికారులు ఎట్టకేలకు స్పందించారు. కార్యాలయంపై అంతస్తుకు వెళ్లే మెట్ల మధ్యలోని మూలకు గుట్కా, అంబార్ నమిలి అపరిశుభ్రం చేసిన స్థలాన్ని మంగళవారం కార్యాలయ సిబ్బంది రంగు వేసి శుభ్రంగా మార్చారు. దీంతోపాటు మరుగుదొడ్లు కూడా శుభ్రం చేశారు.
- Advertisement -



