- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు.
మండలంలోని పెద్దతూoడ్ల గ్రామంలో బ్రిలియంట్ గ్రామర్ హైస్కుల్లో శుక్రవారం ముందస్తుగా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించినట్లుగా పాఠశాల కరస్పాండెంట్ వాలా శశిధర్ రావు తెలిపారు. విద్యార్థిని, విద్యార్థులందరూ పాఠశాల ఆవరణలో రంగురంగుల ముగ్గులు వేసి తమ ప్రతిభను కనబరచడం జరిగిందన్నారు. పాడిపంటలకు ప్రతీక సంక్రాంతి, హరిదాసులు, పతంగులపై జాగ్రత్తలు, అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి,విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు
- Advertisement -



