- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీలోని పోలవరం జిల్లా చింతూరు మండలం సోకిలేరు వ్యూ పాయింట్ వద్ద మంగళవారం విషాదం చోటుచేసుకుంది. వాగులో స్నానానికి దిగిన ఆరుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. అధికారులు ఐదుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. విజయవాడకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ కోస్తూరి నీలేష్ (26) గల్లంతయ్యాడు. అటవీ, పోలీస్ అధికారులు స్థానికుల సహకారంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనతో నీలేష్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.
- Advertisement -



