నవతెలంగాణ – మద్నూర్: క్రీడలు శరీరకంగా మానసికంగా ఎంతో ఉపయోగపడతాయని క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో ఎస్సై విజయ్ కొండ తెలిపారు. మండల కేంద్రంలోని సోమలింగాల గుట్ట ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలను ఎస్సై గురువారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. యువతకు క్రీడలు ఎంతో అవసరమని క్రీడలు శారీరకంగా మానసికంగా ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. క్రికెట్ టోర్నమెంట్ను టాస్ ఎగరవేసి బ్యాటింగ్ తో ఎస్సై ప్రారంభించారు. ఈ క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో మిర్జాపూర్ హనుమాన్ టెంపుల్ చైర్మన్ రామ్ పటేల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమాన్ల స్వామి, మరో నాయకుడు పట్టణాల రమేష్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
క్రీడలు యువకులకు ఎంతో అవసరం: ఎస్సై
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES