- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మంజీరా నది నుండి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ను శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో కుర్ల మంజీరా నుండి డోంగ్లి వైపువస్తున్న డోంగ్లి గ్రామంలో పట్టుకున్నట్లు డోంగ్లి మండల ఆర్ ఐ సాయిబాబా శనివారం సాయంత్రం విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా మంజీరా నది నుండి ఇసుక తరలిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. పట్టుబడ్డ ట్రాక్టర్ను డోంగ్లి మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయానికి తరలించి సీజ్ చేసినట్లు తెలిపారు.
- Advertisement -



