Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలులబ్ధిదారులకు భూ భారతి పట్టా అందించిన సబ్ కలెక్టర్

లబ్ధిదారులకు భూ భారతి పట్టా అందించిన సబ్ కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యలు పరిష్కారం అవుతాయని సబ్ కలెక్టర్ కిరణ్మయి తెలిపారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తు దారులకు సోమూర్ గ్రామానికి చెందిన హనుమంత్ వార్ శివ నంద, ఎబిత్వర్ పూల లబ్ధిదారులకు బాన్సువాడ సబ్ కలెక్టర్ చేతుల మీదుగా మద్నూర్ తహసీల్దార్ కార్యాలయం లో శుక్రవారం భూ భారతి రెవెన్యూ పట్టా హక్కు పత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా పట్టా హక్కులు పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. లబ్ధిదారులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ ఎం డి ముజీబ్, గిర్దవార్ శంకర్, కార్యాలయ సిబ్బంది భూభారతి చట్టం ద్వారా భూ సమస్య పరిష్కరించుకొని పట్టాలు పొందిన లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad