- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని పెద్దతూoడ్ల గ్రామంలోని ఎస్సికాలనిలో డ్రైనేజీలో చెత్తా, చెదారంతో నిండిపోయి, మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తూ దుర్వాసన వేదజల్లుతోందని కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సర్పంచ్ బండారి నర్సింగం ఆదేశాల మేరకు ఉప సర్పంచ్ తాళ్ల రవిందర్ ఆధ్వర్యంలో బుధవారం జీపీ సిబ్బందితో డ్రైనేజీలు, రోడ్లు శుభ్రం చేయించారు.
- Advertisement -



