- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : టీమిండియా పురుషుల జట్టుకు కొత్త ఫీల్డింగ్ కోచ్గా అసోంకు చెందిన మాజీ క్రికెటర్ శుభదీప్ ఘోష్ను బీసీసీఐ నియమించింది. టి. దిలీప్ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో శుభదీప్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆగస్టు 7 నుంచి ప్రారంభమయ్యే శ్రీలంక పర్యటనతో ఆయన సేవలు ప్రారంభం కానున్నాయి. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్, బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్తో కలిసి శుభదీప్ పనిచేయనున్నారు. వివిధ విభాగాల్లో భారత జట్లకు సేవలందించిన ఆయన నియామకంపై అసోం క్రికెట్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది.
- Advertisement -


