నవతెలంగాణ హైదరాబాద్: బలోచిస్థాన్లోని జివానీలో గల పాకిస్థాన్ కోస్ట్ గార్డ్ శిబిరంపై ఆత్మాహుతి దాడి జరిపినట్టు ప్రకటించింది. ఈ ఘటనలో 30 మంది పాక్ జవాన్లు మరణించినట్టు పేర్కొంది. తమ ఫైటర్స్ శిబిరంలోకి చొరబడి, ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారని బీఎల్ఏ ప్రతినిధి మీడియాకు తెలిపారు. అయితే ఈ దాడి, మృతులకు సంబంధించి పాకిస్థాన్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తమకు స్వయంప్రతిపత్తి కల్పించాలని, తమ ప్రాంతంలోని సహజవనరులపై తమకే నియంత్రణ ఉండాలని బలోచిస్థాన్ ప్రావిన్స్లోని వేర్పాటువాద గ్రూపు బీఎల్ఏ దశాబ్దాలుగా డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యం లో తరచూ సైనిక, పారామిలిటరీ, ఇతర ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతోంది. దీనిని పాకిస్థాన్ ఉగ్రవాదసంస్థగా ప్రకటించింది.



