- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : జనగణనలో కులాల లెక్కింపునకు సుప్రీంకోర్టు అనుమతి మంజూరు చేసింది. కులగణనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. సంక్షేమ పథకాల అమలుకు కులగణన తప్పనిసరి అని, బీసీల జనాభా తెలిస్తేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. కులగణన అనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం అని, అందులో కోర్టుల జోక్యం ఉండదని సీజేఐ సూర్యకాంత్ స్పష్టం చేశారు.
- Advertisement -



