- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. తండ్రి ముద్రగడ చివరి చూపు చూసేందుకు ఆయన కూతురు, జనసేన నాయకురాలు క్రాంతి వచ్చారు. ఆమెను ముద్రగడ అనుచరులు అడ్డుకున్నారు. ‘క్రాంతి గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. తాను చనిపోతే కూతురు క్రాంతి రావొద్దని ముద్రగడ చెప్పినట్లు సమాచారం. దాంతో క్రాంతి తల్లి కూడా ఆమెను పంపించేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. దాంతో ఘర్షణ చోటుచేసుకుంది.
- Advertisement -



