Friday, September 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరగాలి: కలెక్టర్

ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరగాలి: కలెక్టర్

- Advertisement -

ప్రిన్సిపాళ్లు, డిఐఈఓ లతో కలెక్టర్ సమీక్ష
నవతెలంగాణ – వనపర్తి  

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం మెరుగుపడాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్, సిబ్బందితో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి అంజయ్య ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. జూనియర్ కళాశాలల పర్ఫామెన్స్ సహా పలు అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం మెరుగుపడాలని ఆదేశించారు. కొన్ని ప్రభుత్వ ప్రైవేటు కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం చాలా తక్కువగా ఉందని మెరుగుపరచాలని గట్టిగా చెప్పారు.

అదేవిధంగా అన్ని కళాశాలలో విద్యార్థుల హాజరు శాతం పెరగాలని సూచించారు. విద్యార్థుల గైర్హాజరు ఎక్కువ లేకుండా చూసుకోవాలని సూచించారు. విద్యార్థులు, అధ్యాపకుల ఫేషియల్ అటెండెన్స్ కు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు. ఇక గత ఏడాదికి, ఈ ఏడాదికి జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ల సంఖ్యను పరిశీలించిన కలెక్టర్ మెరుగుపడాలని ఆదేశించారు. కొన్ని కళాశాలలో అడ్మిషన్లు తగ్గడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా అన్ని కళాశాలల్లో చేరిన విద్యార్థులకు సంబంధించి యుడైస్ పోర్టల్ అప్డేట్ చేయడమే కాకుండా, వారందరికీ తప్పనిసరిగా అపార్ ఐడి క్రియేట్ చేయాలని ఆదేశించారు. రాబోయే మరికొన్ని రోజుల్లో మరోసారి సమావేశం నిర్వహిస్తామని అప్పటిలోపు విద్యార్థులకు యుడైస్, అపార్ ఐడి క్రియేట్ నెంబర్ మెరుగుపడాలని ఆదేశించారు.

గతంలో పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన పనుల మాదిరిగానే విద్యార్థుల తల్లిదండ్రులచే కమిటీల ద్వారా తీర్మానం చేసి కళాశాలలో మరమ్మతులు, మౌలిక సదుపాయాలను కల్పించేందుకు పనులు ముమ్మరం చేయాలన్నారు. ఇందుకోసం కళాశాలల ప్రిన్సిపల్స్ కమిటీ తీర్మానాలు చేసి ఇంజనీరింగ్ అధికారులకు సమర్పిస్తే వెంటనే పనులు ప్రారంభించి ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. ఆ దిశగా పనులు వేగవంతం చేసేందుకు ఈడబ్ల్యుఐడీసీ ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి అంజయ్య, ఈడబ్ల్యుఐడీసీ డి ఈ వెంకటరెడ్డి, ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -