- Advertisement -
నవతెలంగాణ – అశ్వరావుపేట
మండల పరిధిలోని వేదాంత పురం గ్రామ పంచాయతీ సర్పంచ్ గా తోట వెంకటమ్మ విజయం సాధించారు. ఈ సందర్బంగా వెంకటమ్మ మాట్లాడారు. నన్ను నమ్మి నాకు ఓట్లు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు అని తెలిపారు. గ్రామాభివృద్దికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు.
- Advertisement -



