- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : అనుమానాస్పద స్థితిలో తండ్రీకుమార్తె చనిపోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. ఖమ్మం(D) నేలకొండపల్లి(M) కోనాయిగూడేనికి చెందిన కణతాల రాము(30) భార్య రమ్య(28), దివ్యశ్రీ (5), రితిక (3) ఇద్దరు కుమార్తెలతో కలిసి ఖమ్మం సిటీలోని మామిళ్లగూడెంలో నివసిస్తున్నారు. అయితే ఆదివారం సాయంత్రం అతను ఉండే ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో సమీపంలోని వారు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పరిశీలించగా రాము, అతని పెద్దకుమార్తె దివ్యశ్రీ చనిపోయి ఉన్నారు. వారి పక్కన భార్య రమ్య, కూతురు రితిక అపస్మారక స్థితిలో ఉండంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
- Advertisement -



