- Advertisement -
రోడ్లపై పడ్డ చెట్లను ఎస్సై, పోలీస్ సిబ్బంది తొలగింపు..
నవతెలంగాణ – మద్నూర్: మద్నూర్ మండలంలో ఆదివారం సాయంత్రం భారీగా ఈదురు గాలులు వీచాయి. ఉరుములు మెరుపులతో హడలెత్తించాయి. ఈదురు గాలులతో రోడ్ల పైన చెట్లు విరిగిపడ్డాయి. కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోడ్లపై అడ్డంగా పడ్డ చెట్లను తొలగించేందుకు ఎస్సై విజయ్ కొండ పోలీస్ సిబ్బంది ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. ఆదివారం సాయంత్రం వర్షం తక్కువ ఈదురు గాలులు ఉరుములు మెరుపులు ఎక్కువగా రావడంతో జనాలను భయ భ్రాంతులకు గురవుతున్నారు. మరోపక్క కరెంటుకు అంతరాయం ఏర్పడింది.
- Advertisement -