- Advertisement -
నవతెలంగాణ – బల్మూరు
మండల పరిధిలోని జినుకుంట గ్రామంలో పశు వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు మండల పశువైద్యాధికారి అనిల్ తెలిపారు. నేటి నుండి మండలంలోని అన్ని గ్రామాలలో నెల రోజులపాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పశువులు గేదెలు గొర్రెలు మేకలు వంటి వాటికి సంబంధిత వ్యాధి నిరోధక చికిత్సలు అందించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వర్షాకాలం లో పశువులలో గాలికుంటు వ్యాధి సోకి పశువులు తీవ్ర ఇబ్బందులు పడతాయని, రైతులు పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
- Advertisement -