Tuesday, September 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలి: సీపీఐ(ఎం)

ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలి: సీపీఐ(ఎం)

- Advertisement -

నవతెలంగాణ – బొమ్మలరామారం 
మండలంలో ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ర్యకల శ్రీశైలం అన్నారు. భవిష్యత్తులో రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్తు లేదని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ర్యకల శ్రీశైలం మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారా నీకై కృషి చేస్తుందన్నారు. నిరంతరం ప్రజల శ్రేయస్స కోసం కృషి చేస్తున్న సీపీఐ(ఎం) ను అందరూ ఆదరించాలని అన్నారు. కష్టా జీవులకు కార్మికులకు రైతులకు సకల సమస్యల పరిష్కారం కోసం బొమ్మలరామారం మండల ప్రజలకు ఎర్రజెండా అండగా ఉంటుందని అన్నారు. సీపీఐ(ఎం) బలోపేతం కోసం అంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు ప్యారారం వెంకటేష్ దేశెట్టి సత్యనారాయణ కొమురయ్య దేవేందర్ వెంకటేష్ మసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -