Thursday, February 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటాం 

ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటాం 

- Advertisement -

సర్పంచ్ మాధవి మల్లేష్ 
నవతెలంగాణ – మిడ్జిల్ 

గ్రామంలో ఎవ్వరికి ఆపద వచ్చిన ఆదుకునేందుకు ముందుకు వస్తామని ఆపద సమయంలో ప్రజలకు అండగా ఉంటామని సర్పంచ్ మాధవి మల్లేష్ చెప్పారు. బుధవారం మండలంలోని రాణి పేట గ్రామానికి చెందిన శివ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అంత్యక్రియల రూ.5000 ఆర్థిక సహాయాన్ని వార్డు మెంబర్లతో కలిసి అందజేశారు. శివ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం చాలా బాధాకరమని కుటుంబ సభ్యులకు  ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటామని  హామీ ఇచ్చారు. అనంతరం భౌతికకానికి పూల మాలలు వేసి వాళ్ళు అర్పించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబెర్ శ్రీకాంత్ , గ్రామ పెద్దలు జగన్, మహమూద్, మల్లేష్, ఇషాక్, పాండు, పెంటయ్య, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -