Friday, January 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

- Advertisement -

నవతెలంగాణ – మునిపల్లి
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ కూడా రాణించాలని రాయికోడు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మంతూరి సుధాకర్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. శుక్రవారం నాడు మండలంలోని లింగంపల్లి గురుకుల పాఠశాలలో మండల స్థాయి సీఎం కప్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు మానసికల్లాసంతో పాటు శారీరక ఆరోగ్యాన్ని కలిగిస్తాయని అందువల్ల విద్యార్థులు చదువుతోపాటు క్రీడలను అలవాటుగా చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి అంజయ్య,మండల విద్యాధికారి భీంసింగ్, కంకోల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తుకారం స్థానిక జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సురభి చైతన్య పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -