న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలి : హైదరాబాద్ ఆర్డీవోకు టీజీఈజేఏసీ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ఉద్యోగుల జేఏసీ ప్రధాన ఎజెండా అని తెలంగాణ ఎంప్లాయిస్, టీచర్స్ అండ్ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈజేఏసీ) చైర్మెన్ వి లచ్చిరెడ్డి అన్నారు. న్యాయబద్ధమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని కోరారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం హైదరాబాద్లోని నాంపల్లిలో హైదరాబాద్ ఆర్డీవో కె రామకృష్ణను లచ్చిరెడ్డి నేతృత్వంలో కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాలో లచ్చిరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసమే కార్యాచరణ చేపట్టామని అన్నారు. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా మండల, రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో అధికారులకు వినతిపత్రాలను అందజేస్తున్నామని వివరించారు. జూన్ రెండు నాటికి పీఆర్సీని అమలు చేయాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని కోరారు. ఉద్యోగులకు ఆరోగ్య కార్దులను తక్షణమే అమలు చేయాలన్నారు. సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని సూచించారు. 2004 సెప్టెంబర్ ఒకటికి ముందు నోటిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత నియామకమైన ఉద్యోగులకు ఓపీఎస్ను అమలు చేయాలని చెప్పారు. పెండింగ్ డీఏలను విడుదల చేయాలన్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 61 ఏండ్లు నిండిన వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సాధారణ బదిలీలు చేపట్టాలనీ, సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ భాగస్వామ్య ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హన్మంతరావు, నిర్మల, దర్శన్గౌడ్, కుమార్, ఉపేందర్ రావు, చంద్రశేఖర్ గౌడ్, హబీబ్ మియా, కృపాకర్రెడ్డి, మొయినుద్దీన్, సీహెచ్ లక్ష్మయ్య, రాములు, రమేష్ పాక, రవి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



