కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు జీవనానికి సోపానాలు

– జిల్లాధికార ప్రతినిధి పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి 
– బేగంపేటలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై ఇంటింటా ప్రచారం
నవతెలంగాణ-బెజ్జంకి : కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ప్రజలందరి జీవనానికి సోపానాలుగా నిలుస్తాయని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణను భారీ మేజారీటీతో గెలిపించాలని జిల్లాధికార ప్రతినిధి పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రజలను విజ్ఞప్తి చేశారు.అదివారం మండల పరిధిలోని బేగంపేట గ్రామంలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై కాంగ్రెస్ శ్రేణులతో కలిసి రాజశేఖర్ రెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహించారు.మండలాధికార ప్రతినిధి జనగాం శంకర్, గ్రామాధ్యక్షుడు అమరెందర్ రెడ్డి, నాయకులు వెంకటచారి,బుర్ర తిరుపతి గౌడ్,రాజేశం, బ్రహ్మచారి,పిట్టల అరుణ్,కనకయ్య,రవి,నర్సయ్య,అనిల్, కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love