టీమిండియాకు రూ. 125 కోట్ల ప్రైజ్‌మనీ..

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ప్రపంచ కప్‌ను గెలుచుకున్నందుకు టీమ్ ఇండియాకు రూ.125 కోట్ల ప్రైజ్ మనీని బీసీసీఐ సెక్రటరీ జే షా ప్రకటించారు. టీ20 ప్రపంచకప్ సిరీస్‌లో భారత జట్టు మంచి ప్రదర్శన చేసింది. ఆటగాళ్లు, కోచ్‌లు, మద్దతుదారులందరికీ బీసీసీఐ సెక్రటరీ జై షా అభినందనలు తెలిపారు. శనివారం సౌతాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత జట్టు 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Spread the love