– టీజీపీఎస్సీ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో వ్యవసాయ, సహకార శాఖలో అగ్రికల్చర్ ఆఫీసర్ (ఏవో) పోస్టులకు 145 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కార్యదర్శి నవీన్ నికోలస్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 148 ఏవో పోస్టుల భర్తీకి 2022, డిసెంబర్ 28న టీజీపీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మల్టీజోన్-1, మల్టీజోన్-2 పరిధిలో 145 మంది అభ్యర్థులను ప్రొవిజినల్గా ఎంపిక చేశామని తెలిపారు. ఆ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను జోన్ల వారీగా షషష.్రజూరష.స్త్రశీఙ.ఱఅ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని వివరించారు. 148 ఏవో పోస్టుల భర్తీకి గతేడాది మే 16న ఆన్లైన్లో సీబీఆర్టీ విధానంలో రాతపరీక్షలను నిర్వహించామనీ, 8,961 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని తెలిపారు. వారిలో 8,074 మంది హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారని పేర్కొన్నారు. పేపర్-1కు 6,546 మంది, పేపర్-2కు 6,519 మంది హాజరయ్యారని వివరించారు.